1, డిసెంబర్ 2011, గురువారం

బాపు గారి శ్రీరామ రాజ్యం ...

బాపూ గారి శ్రీరామ రాజ్యంలో చివరిలో యాగాశ్వాన్ని కాపాడు కోడానికి వచ్చిన శ్రీ రాముడిని చూసి కుశలవులు
ముందుగా శ్రీరామ చంద్ర ప్రభువునకు నమస్కార , తిరస్కర బాణాలు వేసే సన్నివేశం ఉంది.

కుశలవు లిద్దరూ ఒకే సారి నమస్కార బాణాలనీ, ఒకే సారి తిరస్కార బాణాలనీ ప్రయోగించ లేదు.

ఒకరు నమస్కార బాణాన్నీ, ఒకరు తిరస్కార బాణాన్నీ ప్రయోగించారు.

కుశలవు లిద్దరిలో ఒకరు శ్రీరామ చంద్రునికి నమస్కరించి నట్టుగానూ, ఒకరు తిరస్కరించి నట్టుగానూ అనిపించింది.

ఇదేమంత అనౌచిత్యం కాదు కానీ నాకు మాత్రం ఏదో కొంత అసంతృప్తి కలిగించింది. మరి, మీకేమనిపించిందో ?

ఇద్దరూ ఒకే సారి నమస్కార, తిరస్కార బాణాలు ప్రయోగించి నట్టుగా చూపిస్తే బాగుండేదేమో ?





కామెంట్‌లు లేవు: